పహల్గామ్ దాడిపై జనసేన సంతాపం! ఉగ్రవాదంపై కనికరం అవసరం లేదు! పైన్ స్టేట్మెంట్!
Tue Apr 29, 2025 12:44 Politics.202504295259.jpg)
పహల్గామ్ ఉగ్రదాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై జనసేన పార్టీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఈ దారుణ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందిస్తూ, మృతులకు సంతాపం తెలిపారు. ఉగ్రవాదులు ఐడీ కార్డులు అడిగి మతం తెలుసుకొని హిందువులపై దాడి చేసిన ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. షికారుకు వచ్చినట్లు వచ్చి పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని అత్యంత క్రూరంగా అమాయకులను హతమార్చారని పేర్కొన్నారు. దేశం మొత్తం ఈ ఘటనతో కుదిపిపోవడమేకాకుండా, పహల్గామ్ నుండి వ్యాపించిన ప్రకంపనలు దేశవ్యాప్తంగా తారాస్థాయికి చేరాయని ఆయన వ్యాఖ్యానించారు. సరిహద్దు భద్రతను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని, నిరాయుధ ప్రజలపై దాడి చేయడం అత్యంత నిందనీయమని అన్నారు.
ఇది కూడా చదవండి: మరో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సీఎం చంద్రబాబు! లిస్ట్ ఇదుగోండి..!
పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, కశ్మీర్లో రాష్ట్రపతి పాలన ఉన్నంతవరకు పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నాయని గుర్తుచేశారు. ఇప్పుడేమైతే ఉగ్రదాడులు జరుగుతున్నాయో, భవిష్యత్తులో ఇటువంటి దాడులు జరగకుండా చూస్తేనే సమృద్ధిగా మన దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. లక్షలాది కశ్మీరీ పండిట్లు వలస వెళ్లిపోవడం, అప్పటి నుంచి కశ్మీర్లో శాంతి లేకుండా పోవడం బాధాకరమని అన్నారు. “కశ్మీర్ భారత్లో భాగమే, ఎప్పటికీ అలాగే ఉంటుంది. భారత్లో ఉండి పాకిస్థాన్కు మద్దతుగా మాట్లాడేవారు ఆ దేశానికే వెళ్లిపోవాలి,” అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. మతం అడిగి చంపిన ఘటనను ప్రత్యక్ష సాక్షులు చెబుతుంటే నమ్మకపోవడం ఆశ్చర్యకరమని, అతి మంచితనం మంచిది కాదని, అతి సహనం ప్రమాదకరమని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: వివేక హత్య కేసులో బిగ్ షాక్! విచారణలో కీలక మలుపు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..
తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!
గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!
ఆ ఇద్దరినీ ఒకే జైలు గదిలో ఉంచాలని కోరిన టీడీపీ నేత! తన పక్కన ఎవరో ఒకరు..
మూడు రోజులు వానలే వానలు.. అకస్మాత్తుగా మారిన వాతావరణం.! ఈ ప్రాంతాలకు అలర్ట్!
టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరిని అరెస్ట్ - త్వరలో ఛార్జిషీట్!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఫీజులు తగ్గింపు.. సెప్టెంబర్ నుంచి అమల్లోకి!
రేపే జిఎంసి ఎన్నిక! నేడు నామినేషన్ వేయనున్న కూటమి అభ్యర్థి!
రైతులకు తీపి కబురు! పీఎం - కిసాన్ 20వ విడత.. పూర్తి సమాచారం!
వైసీపీకి షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.